ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
Sat Jun 07, 2025 16:13 Politics.202506074750.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన అలర్ట్ను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 10వ తేదీ రాత్రివరకు ఈ సేవలు నిలిచే అవకాశం ఉండగా, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. Microsoft Cloud నుంచి రాష్ట్ర ప్రభుత్వ డేటా సెంటర్కు (SDC) AP Seva Portal ను మైగ్రేట్ చేయడం వల్ల ఈ అంతరాయం ఏర్పడుతోంది. దీని కారణంగా ఆదాయ ధ్రువీకరణ, సమగ్ర ధ్రువీకరణ, భూమి మ్యుటేషన్లు, రేషన్ కార్డు సేవలు, పట్టాదారు పాస్బుక్లు, ప్రాపర్టీ ట్యాక్స్, మత్స్య శాఖ లైసెన్సులు వంటి అనేక ముఖ్యమైన సేవలు సచివాలయాల్లో తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.
ఇది కూడా చదవండి: అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
అయితే, ఈ డేటా మార్పిడి ప్రభావం అన్ని సేవలపై ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఆధార్ అప్డేట్స్, బ్యాంకింగ్ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇతర నాన్-రెవెన్యూ ఆధారిత సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు అత్యవసరమైన ధ్రువీకరణ పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించగా, మార్పులు పూర్తైన వెంటనే సేవలు మళ్లీ పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ప్రజలు [https://ap.gov.in/](https://ap.gov.in/) లేదా సంబంధిత గ్రామ సచివాలయ అధికారిక పోర్టల్స్ను సందర్శించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్పోర్ట్ రేంజ్లో కొత్త లుక్!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...
వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #APSevaPortal #OnlineServicesSuspended #AndhraPradeshAlert #GramaSachivalayam #WardSachivalayam #DataMigration #GovtServicesUpdate #CitizenAlert #APGovtNotice #DigitalGovernance
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.